Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:41 PM

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...
February 08, 2026 05:47 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

వంచన చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి: రామచందర్ రావు పిలుపు....

కోదాడ తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని బిజెపి నేత ఎన్. రామచందర్ రావు అన్నారు. కోదాడ పట్టణంలో మున్సీపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, రంగా థియేటర్ చౌరస్తా వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, మరోవైపు బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్ఎస్ రెండు కూడా అవినీతి పార్టీ లేనాని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతటా అభివృద్ధి పరుగులు తీస్తోందని, కానీ రాష్ట్ర పాలకులు కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కోదాడను అమృత్ పథకం కింద అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికీ మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. యువత మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలను వంచిస్తున్న పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతోందని కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోదాడ అభివృద్ధి కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైంది. మురుగునీటి సమస్యలు, అధ్వాన్నపు రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దుస్థితి మారాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని వ్యాఖ్యానించారు.కమలం గుర్తుకు ఓటు వేసి భాజపా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, జుట్టు కొండా సత్యనారాయణ,కొప్పుల నరసింహారెడ్డి, మురళీధర్ రెడ్డి, వంగవీటి శ్రీనివాస్,బండారు కవిత రెడ్డి, అంజి యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకటరామయ్య,నూనె సులోచన, యదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News