కోదాడ పోలీస్ లాక్అప్డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు
కోదాడ పోలీస్ లాక్అప్డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు
Editor Desk
స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్
కోదాడ పోలీస్ లాక్అప్డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు కీర్తిశేషులు కర్ల రాజేష్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు గారి సూచన మేరకు నేడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,హైకోర్టు న్యాయవాది కే.వీ.రామారావు,
బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు కోదాడకు వెళ్లి,మృతుడు కర్ల రాజేష్ గారి తల్లి
శ్రీమతి కర్ల లలితమ్మ గారిని,వారి సోదరుడు తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...కోదాడ పోలీస్ లాక్అప్లో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత దారుణమైనదని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చగా నిలుస్తుందని తీవ్రంగా ఖండించారు. కర్ల రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సంపూర్ణ న్యాయం చేయాలని,ఈ ఘటనకు కారకులైన పోలీస్ అధికారులపై
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని,దోషులైన పోలీస్ అధికారులను
వారి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని,ఈ ఘటనపై
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్తో స్వతంత్ర న్యాయ విచారణ నిర్వహించాలని,బీజేపీ డిమాండ్ చేసింది.అంతేకాకుండా,దోషులను వెంటనే గుర్తించి
కఠినమైన శిక్షలు విధించేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి