Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 09:47 AM

కోదాడ పోలీస్ లాక్‌అప్‌డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు

కోదాడ పోలీస్ లాక్‌అప్‌డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు

కోదాడ పోలీస్ లాక్‌అప్‌డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు
January 24, 2026 10:01 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

కోదాడ పోలీస్ లాక్‌అప్‌డెత్ లో మృతి చెందిన దళిత నాయకుడు కీర్తిశేషులు కర్ల రాజేష్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు గారి సూచన మేరకు నేడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,హైకోర్టు న్యాయవాది కే.వీ.రామారావు,

బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు కోదాడకు వెళ్లి,మృతుడు కర్ల రాజేష్ గారి తల్లి

శ్రీమతి కర్ల లలితమ్మ గారిని,వారి సోదరుడు తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...కోదాడ పోలీస్ లాక్‌అప్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత దారుణమైనదని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చగా నిలుస్తుందని తీవ్రంగా ఖండించారు. కర్ల రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సంపూర్ణ న్యాయం చేయాలని,ఈ ఘటనకు కారకులైన పోలీస్ అధికారులపై

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని,దోషులైన పోలీస్ అధికారులను

వారి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని,ఈ ఘటనపై

జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో స్వతంత్ర న్యాయ విచారణ నిర్వహించాలని,బీజేపీ డిమాండ్ చేసింది.అంతేకాకుండా,దోషులను వెంటనే గుర్తించి

కఠినమైన శిక్షలు విధించేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News