Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:26 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివి

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివి

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివి
March 23, 2026 02:44 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ట మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మిట్టకోల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మిట్టకొల సతీష్ కుమార్ ,పద్మశాలి ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం చంద్రశేఖర్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు కడారి బిక్షం, మున్సిపల్ కౌన్సిలర్ గండూరి రమేష్ , ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ముశం హరి ప్రసాద్ లు మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివని అన్నారు. 1969 లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని వెల్లడించారు. స్వాతంత్రం పోరాటం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమ వరకు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం పురుడుపోసుకుందని అన్నారు. నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమ నాయకులలో బాపూజీ మొదటి వ్యక్తి అని తెలిపారు. దేశంలోనే సహకార సంఘాలు రూపకల్పన చేసింది బాపూజీ అని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు, చేనేత సహకార సంఘాల కోసం ఆయన కృషి మరువలేనిదని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టించడం చాలా గొప్ప విషయమని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు కొన్ని వడిదడుగులు వచ్చినా కూడా వాటిని అధిగమించి అందరి సహకారంతో విగ్రహాన్ని ప్రతిష్టించుకోగలిగామని అన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి, వర్ధంతి తోపాటు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం కోశాధికారి బాల్ని మల్లయ్య, కోట వీరయ్య, వరకాల శ్రీనివాస్, కేతం రమేష్ ,మిట్టకోల రామన్న ,దేవరశెట్టి ప్రభాకర్, తాటి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News