కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నిర్వహించిన మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి నాలుగు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో మైనారిటీ BC-E నుంచి మొహమ్మద్ అబ్దుల్ కయుం (ముంతాజ్ సెట్), అర్ఫిన్ సుల్తాన్ మహమ్మద్ అబ్దుల్ మోహిజ్, కురుమ BC-B నుంచి నర్సు గోండ, వీరశైవ లింగాయత్ BC-D నుంచి శెట్టి రేష్మ శెట్టి శంకర్ ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ అభివృద్ధిలో తమ సలహాలు, సూచనలు కీలకంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి