కంచనపల్లిలో ఎన్ఎస్ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"
కంచనపల్లిలో ఎన్ఎస్ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
కంచనపల్లిలో ఎన్ఎస్ఎస్ శ్రమదాన శిబిరాలు ప్రారంభం: విద్యార్థుల సేవాభావం గ్రామానికి స్ఫూర్తి"
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్
ఈరోజు కంచనపల్లి గ్రామoలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి,)నల్గొండ ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాలు ఉపేందర్ గారి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ IV ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి గారు ,ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరీ గారు పాల్గొన్నారు.కంచనపల్లి పాఠశాల HM సతీరెడ్డి గారు, శారదా మేడం గారు పాల్గొన్నారు.వాలంటీర్స్ NSS సాంగ్ తో ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది.
మహేశ్వరి గారు మాట్లాడుతూ విద్యార్ధులలో ఉన్న సేవాభావాన్ని వెలికి తీసే అవకాశం తోబాటు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తయారువుతారని అన్నారు.ఈ కార్యక్రమంలోమహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక శిబిరాలను గ్రామ ప్రజలకు సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అక్షరాస్యత, ఆరోగ్యం పై అవగాహన మరియు సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.
సర్పంచ్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ శిక్ష ఆధ్వర్యంలో మా గ్రామంలో వారం రోజులపాటు శ్రమదానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగిస్తున్నందుకు మా గ్రామానికి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు అభినందనలు తెలియజేశారు. యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మంద సావిత్రి గ్రామ ప్రజలు ప్రజలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ చెట్లకు పాదులు తవ్వడం జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి