Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:21 AM

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం
March 26, 2026 04:42 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జునసాగర్: కంప్యూటర్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ప్రపంచ స్థాయి ఉద్యోగాలను సులభంగా పొందవచ్చని నాగార్జున సాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బొబ్బిలి రాజా పేర్కొన్నారు.

గురువారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. బొబ్బిలి రాజా మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం కలిగిన వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాలు ఉపేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడం, కెరీర్ ఎంపికలో స్పష్టత కల్పించడం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విభాగాధిపతి వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, సి.ఓ.ఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News