Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 06:23 PM

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం
March 26, 2026 04:42 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జునసాగర్: కంప్యూటర్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ప్రపంచ స్థాయి ఉద్యోగాలను సులభంగా పొందవచ్చని నాగార్జున సాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బొబ్బిలి రాజా పేర్కొన్నారు.

గురువారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. బొబ్బిలి రాజా మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం కలిగిన వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాలు ఉపేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడం, కెరీర్ ఎంపికలో స్పష్టత కల్పించడం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విభాగాధిపతి వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, సి.ఓ.ఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News