కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం
కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం
Editor Desk
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం, టీఎస్కేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉమెన్ అండ్ ఏఐ’ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ సైన్స్కు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధి అవకాశాల సాధనలో కంప్యూటర్ నైపుణ్యాలు కీలకమని, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు ఎంత విద్యావంతులైనా వెనుకబడినట్లే అవుతారని పేర్కొన్నారు.
కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి. అమర్ మాట్లాడుతూ వారం రోజుల శిక్షణలో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్, పవర్ బీఐ, పైథాన్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, శిక్షకులు జి. సంజీవులు, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, నరేష్, రాధిక, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి