Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:02 AM

కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం

కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం

కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం
March 25, 2026 05:45 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం, టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉమెన్ అండ్ ఏఐ’ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ సైన్స్‌కు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధి అవకాశాల సాధనలో కంప్యూటర్ నైపుణ్యాలు కీలకమని, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు ఎంత విద్యావంతులైనా వెనుకబడినట్లే అవుతారని పేర్కొన్నారు.

కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి. అమర్ మాట్లాడుతూ వారం రోజుల శిక్షణలో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్, పవర్ బీఐ, పైథాన్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, శిక్షకులు జి. సంజీవులు, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, నరేష్, రాధిక, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News