Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:06 PM

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
April 02, 2026 06:13 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో గంగా భవాని ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని నాయకులు కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లోండే నర్సింహులు మాట్లాడుతూ, గంగా భవాని తన పదవిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సిద్ధేశ్వర ఉపాధ్యక్షులు చన్నబసప్ప, మొగ్లప్ప, సంతోష్, సంతోష్ రెడ్డి, విఠల్, విశ్వనాథ్, మజారుద్దీన్, మహిపతి నాయక్ తదితరులు మండలంలోని సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భూమి సంబంధిత సమస్యలు, రెవెన్యూ సేవలలో ఆలస్యం, పేదల సంక్షేమ పథకాల అమలులో లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన గంగా భవాని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మార్వోను సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News