కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
Krishna
కంగ్టి మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో గంగా భవాని ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని నాయకులు కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లోండే నర్సింహులు మాట్లాడుతూ, గంగా భవాని తన పదవిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సిద్ధేశ్వర ఉపాధ్యక్షులు చన్నబసప్ప, మొగ్లప్ప, సంతోష్, సంతోష్ రెడ్డి, విఠల్, విశ్వనాథ్, మజారుద్దీన్, మహిపతి నాయక్ తదితరులు మండలంలోని సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భూమి సంబంధిత సమస్యలు, రెవెన్యూ సేవలలో ఆలస్యం, పేదల సంక్షేమ పథకాల అమలులో లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన గంగా భవాని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మార్వోను సన్మానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి