Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:27 AM

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
02-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో గంగా భవాని ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని నాయకులు కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లోండే నర్సింహులు మాట్లాడుతూ, గంగా భవాని తన పదవిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సిద్ధేశ్వర ఉపాధ్యక్షులు చన్నబసప్ప, మొగ్లప్ప, సంతోష్, సంతోష్ రెడ్డి, విఠల్, విశ్వనాథ్, మజారుద్దీన్, మహిపతి నాయక్ తదితరులు మండలంలోని సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భూమి సంబంధిత సమస్యలు, రెవెన్యూ సేవలలో ఆలస్యం, పేదల సంక్షేమ పథకాల అమలులో లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన గంగా భవాని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మార్వోను సన్మానించారు.

Sthanikam

కంగ్టి మండలానికి నూతన ఎమ్మార్వో గంగా భవాని కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

Article Image

కంగ్టి మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో గంగా భవాని ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని నాయకులు కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లోండే నర్సింహులు మాట్లాడుతూ, గంగా భవాని తన పదవిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సిద్ధేశ్వర ఉపాధ్యక్షులు చన్నబసప్ప, మొగ్లప్ప, సంతోష్, సంతోష్ రెడ్డి, విఠల్, విశ్వనాథ్, మజారుద్దీన్, మహిపతి నాయక్ తదితరులు మండలంలోని సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భూమి సంబంధిత సమస్యలు, రెవెన్యూ సేవలలో ఆలస్యం, పేదల సంక్షేమ పథకాల అమలులో లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన గంగా భవాని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మార్వోను సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News