కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి ; జిల్లా ఎస్పీ నరసింహ
కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి ; జిల్లా ఎస్పీ నరసింహ
Bandi Kiran Kumar
కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలని రికార్డు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతోపాటు వారికి భరోసా కల్పించాలని సిబ్బందికి సూచించారు ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుండి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాలు మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు సిబ్బంది అందరూ ఐక్యమత్యంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై నాగరాజు పోలీస్ సిబ్బంది ఉన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి