కెసిఆర్ ను సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం చిరుమర్తి లింగయ్య
కెసిఆర్ ను సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం చిరుమర్తి లింగయ్య
Komidala Mahender reddy
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడిని రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాల త్యాగాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే సిట్ విచారణ చేపట్టారని విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్పై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి