కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట
కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట
Biksham
వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ - కరుణ శ్రీ
ప్రారంభకులు కేసారం గ్రామ సర్పంచ్ రేఖ రమణ సతీష్ గౌడ్
సూర్యాపేట రూరల్ మండల కేంద్రం కేసారం గ్రామ పరిధిలో బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 14 వ బ్రాంచ్ సంఘము నకు ముఖ్య అతిధులుగా పాస్టర్ బి.యస్.రూబెన్, పాస్టర్ సి. హెచ్. శ్యామ్ ప్రసాద్ ప్రార్ధన చేయగా గ్రామ సర్పంచ్ రేఖ రమణ సతీష్ రిబ్బన్ కట్ చేసి మాట్లాడుతూ దేవుని మందిరము ప్రారంభం చేయడం పట్ల సంతోషం గా వున్నదని, చర్చ్ ముందు వీధి లైట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.అనంతరం బిషప్ దుర్గం హెప్సిబా (కరుణ శ్రీ ) ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సేవా చేయడం గొప్ప భాగ్యమని, ఈ మందిరం 14 వ బ్రాంచ్ సంఘము అనీ ఈ మందిరం ద్వారా గ్రామస్తులకు దేవుని ఆశీస్సులు పొందాలని అందరు సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్ధన చేశారు.ఈ కార్యక్రమం లో సభాధ్యక్షులు ఏర్పుల క్రిస్టోఫర్,బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, పాస్టర్ జయంత్ గజ్వెల్,సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు జలగం జేమ్స్, రూరల్ అధ్యక్షులు యల్క ప్రభాకర్,బొక్క ఏలీయా రాజు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి