క్యాంప్ ఆఫీసులో ధ్వంసం చేసిన కాంగ్రెస్ గూండాలను శిక్షించాలి; తాటికొండ సీతయ్య
క్యాంప్ ఆఫీసులో ధ్వంసం చేసిన కాంగ్రెస్ గూండాలను శిక్షించాలి; తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమంగా చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ...
రాష్ట్రం లో ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతనుంది ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారమే ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని. ప్రజలు గ్రహించారని తగిన విధంగా గుణ పాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత కొద్ది రోజుల క్రితం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగినప్పుడు పోలీసులు చర్య తీసుకుని ఉంటే మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకుండా ఉండేదని అన్నారు. ఒక చోట జరిగినప్పుడు పోలీసులు చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వల్లనే జడ్చర్ల లో జరిగిందని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేక్యాంప్ ఆఫీసుపై దాడి అనేది తెలంగాణ రాష్ట్రం సాధించిన కెసిఆర్ మనోభావాలనుదెబ్బతేయాలనే కుట్రలో భాగమేనని అన్నారు. ఇలాంటి అరాచకాలు రాష్ట్రం లో మరెక్కడా జరగకుండా ఉండాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్ని అరాచకాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత పోగొట్టుకోలేరని. ఇంకెంత కాంగ్రెస్ పార్టీ కే నష్టమని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు సంయమనం తో సమయం కోసం ఎదిరి చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశం లో బీ ఆర్ఎస్ జిల్లనాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి