Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

కౌన్సిలర్ ఎలమందల నర్సయ్యకు ఘన సన్మానం.....

కౌన్సిలర్ ఎలమందల నర్సయ్యకు ఘన సన్మానం.....

కౌన్సిలర్ ఎలమందల నర్సయ్యకు ఘన సన్మానం.....
February 21, 2026 07:44 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

17వ వార్డు అభివృద్ధికి కృషి చేయాలి......

కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుండి కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఎలమందల నర్సయ్యను మిత్రమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు మాట్లాడుతూ నర్సయ్య లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు పైడిమర్రి సత్తిబాబు, మందడి రంగారెడ్డి, పోటు రంగారావు, కందిబండ సత్యం,ముత్తినేని సైదయ్య, తాళ్లూరి నరసింహారావు, పాశం నాగిరెడ్డి, కోదాటి నరసింహారావు,నెల్లూరు వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, శ్రీనివాసరావు, బాల్ రెడ్డి, రాంబాబు, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News