కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ
కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ
Sthanikam District Staff Reporter
సేవే లక్ష్యంగా భక్తుల కోసం బోరు ఏర్పాటు చేస్తానన్న శివరాజ్ గౌడ్
భవనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్ నాయకత్వంలో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు.కాటమయ్య గుడి వద్దకు వచ్చే భక్తులకు తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలియజేశారు. గుడి ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, తన స్వంత నిధులతో బోరు త్రవ్వించి,బోరు మోటార్ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గౌస్ నగర్ గౌడ సంఘ సభ్యులు శివరాజ్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నూతన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గౌస్ నగర్ గౌడ సంఘ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కమిటీ సభ్యులు నల్లమాస నాదం,నల్లమాస దానయ్య, నల్లమాస కుమార్,నల్లమాస రాములు,నల్లమాస శంకరయ్య,ఆర్ఎంపి నల్లమాస శ్రీశైలం,రాగిరు కృష్ణ, నల్లమాస శేఖర్,నల్లమాస కృష్ణ, అంతటి శ్రీరాములు,మాద నరేష్,రాగిర్ పాండు, నల్లమాస భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి