Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్
February 28, 2026 05:48 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం పేర్కొంది. శనివారం సోమందేపల్లిలోని పాఠశాల ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రూపొందించిన సుమారు 520 రకాల మోడల్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు తమ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా సమగ్రంగా వివరించారు.


ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ప్రసాద్ మరియు ఎండీ అనిల్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థులకు భారతదేశ చరిత్ర, విజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు, వారి ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రజలకు వివరించడం వల్ల వారిలోని భయం, టెన్షన్ తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హరినాథ్, సైన్స్ ఉపాధ్యాయులు రఘునాథ్, వినోద్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News