క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్
క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం పేర్కొంది. శనివారం సోమందేపల్లిలోని పాఠశాల ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు రూపొందించిన సుమారు 520 రకాల మోడల్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు తమ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ప్రసాద్ మరియు ఎండీ అనిల్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థులకు భారతదేశ చరిత్ర, విజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు, వారి ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్ల ద్వారా విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రజలకు వివరించడం వల్ల వారిలోని భయం, టెన్షన్ తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హరినాథ్, సైన్స్ ఉపాధ్యాయులు రఘునాథ్, వినోద్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి