Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:57 PM

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం
06-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్, లలేష్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 64 జట్లు పాల్గొనగా, 22 రోజుల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించాయి. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అరూర్ మరియు ఏర్దానూర్ జట్లు తలపడగా, విజేత జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేశం విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు మరింత కృషి చేసి ముందుకు సాగాలని, గెలిచిన వారు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. నేటి యువత జీవితంలో లక్ష్యంతో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు చూపే మంచి మార్గంలో నడవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మంచి స్నేహితులను ఎంచుకుని చెడు అలవాట్లు, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు అధికంగా అలవాటు పడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ గౌతమ్, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రముఖులు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం

Article Image

వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్, లలేష్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 64 జట్లు పాల్గొనగా, 22 రోజుల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించాయి. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అరూర్ మరియు ఏర్దానూర్ జట్లు తలపడగా, విజేత జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేశం విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు మరింత కృషి చేసి ముందుకు సాగాలని, గెలిచిన వారు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. నేటి యువత జీవితంలో లక్ష్యంతో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు చూపే మంచి మార్గంలో నడవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మంచి స్నేహితులను ఎంచుకుని చెడు అలవాట్లు, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు అధికంగా అలవాటు పడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ గౌతమ్, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రముఖులు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News