Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:27 PM

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు
March 17, 2026 07:27 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

దొడ్డనకేరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోయ తలారి వీరేంద్ర పంట పొలంలో వేరుశనగ యంత్రానికి వేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మారుతీ నాయుడు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు K శివప్ప , టౌన్ అధ్యక్షుడు B తిమ్మప్ప , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News