Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 11:30 AM

కరస్గుత్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

కరస్గుత్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

కరస్గుత్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
June 01, 2026 04:43 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్,అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ది మండలం కరస్గుత్తి గ్రామంలో సోమవారం మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు, మహిళలు, యువతకు అవగాహన కల్పించిన నారాయణఖేడ్ డివిజన్ షీ టీమ్ ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం మాట్లాడుతూ మహిళల రక్షణకు షీ టీమ్ నిరంతరం కృషి చేస్తోందని, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో వేధింపులు, బాలల రక్షణ చట్టాలు, మహిళల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని షీ టీమ్ ఇంచార్జీ ఏఎస్ఐ తులసి రాం సూచించారు.ఈ కార్యక్రమంలో నాగల్గిద్ది పోలీస్ అధికారులు,షీ టీమ్

కానిస్టేబుల్ చాంగుబాయి, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మహిళల భద్రత, బాలల సంక్షేమం, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News