కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
Krishna
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులను గౌరవిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు కార్మికులకు “శ్రమశక్తి ఉత్తమ అవార్డులు” ప్రదానం చేసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికుల శ్రమే తెలంగాణ సంపద సృష్టికి పునాది అని, తమ కష్టంతో సమాజ నిర్మాణం చేసి దేశ పురోగతికి తోడ్పడుతున్న ప్రతి శ్రామికుడికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు దక్కాలని, ప్రతి కార్మికుడు తన హక్కుల పట్ల చైతన్యవంతుడై ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసంఘటిత రంగ గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్ రెడ్డి, శీలవంత్, దిలీప్, అభిషేక్, అజారుద్దీన్, చంద్రశేఖర్ శర్మ, షాహెద్ అలీ, సంగమేష్ స్వామి, చంద్రకళ, జగదీశ్వరి, శ్యామల, అర్చన, యోగేంద్ర శర్మ, ప్రశాంత్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి