Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:32 PM

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు అవసరం.జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు అవసరం.జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు అవసరం.జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం
March 20, 2026 04:59 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కార్మిక ఉద్యమ నాయకుడు తిరందాసు గోపి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.

సిఐటియు జిల్లా మాజీ కార్యదర్శి తిరందాసు గోపి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మండల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి “లేబర్ కోడ్లు – కార్మికులపై ప్రభావం” అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నూతన కార్మిక చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ విధానాలు వారి జీవన పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్మిక ఉద్యమానికి తిరందాసు గోపి చేసిన సేవలు అపూర్వమని, ఆయన మరణం ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోములు, జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము,జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంగాల మారయ్య,గాదెకృష్ణ, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా నాయకులు పల్లె సత్యం, వేముల సైదులు,బజార్ హమాలి సంఘం నాయకులు మోటె అంజయ్య,రేగు జంగయ్య,మిర్యాల బిక్షం, నరసింహ, మిర్యాల శ్రీశైలం, మొగులయ్య,నాగటి అంజయ్య, స్వామి,గోరయ్య తదితరులు పాల్గొన్నారు..



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News