Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి... ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి... ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి...  ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న
February 10, 2026 06:39 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డి గూడెం ;

ఈనెల 16న అర్వపల్లి మండల కేంద్రంలో జరగబోయే కర్ల రాజేష్ సంతాప సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న పిలుపునిచ్చారు.మంగళవారం అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.2025 నవంబర్ 16 న కోదాడలో లాకప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.ఇందుకోసం ఈనెల 16 న సాయంత్రం 5 గంటలకు జరగబోయే రాజేష్ సంతాప సభకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు చెప్పారు.రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అంతేగాక ఈ ఘటనలో సంబంధం ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పూలే, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఈదురు వీరపాపయ్య,విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు గడ్డం ఖాసీం,జిల్లా కార్యదర్శి పాల్వాయి పరశురామ్,కొండగడుపుల శ్రీను, మండల అధ్యక్షులు కుంకుడుపాల రవి,కార్యదర్శి మచ్చ నర్సయ్య, నాయకులు ఊటుకూరి రవీందర్,సంపతి విష్ణు,చెరుకు శైలేందర్,గుండె ఈశ్వర్, సూరారపు సైదులు,కొమ్ము వెంకన్న,కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News