Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి... ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి... ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి...  ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న
10-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డి గూడెం ;

ఈనెల 16న అర్వపల్లి మండల కేంద్రంలో జరగబోయే కర్ల రాజేష్ సంతాప సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న పిలుపునిచ్చారు.మంగళవారం అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.2025 నవంబర్ 16 న కోదాడలో లాకప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.ఇందుకోసం ఈనెల 16 న సాయంత్రం 5 గంటలకు జరగబోయే రాజేష్ సంతాప సభకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు చెప్పారు.రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అంతేగాక ఈ ఘటనలో సంబంధం ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పూలే, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఈదురు వీరపాపయ్య,విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు గడ్డం ఖాసీం,జిల్లా కార్యదర్శి పాల్వాయి పరశురామ్,కొండగడుపుల శ్రీను, మండల అధ్యక్షులు కుంకుడుపాల రవి,కార్యదర్శి మచ్చ నర్సయ్య, నాయకులు ఊటుకూరి రవీందర్,సంపతి విష్ణు,చెరుకు శైలేందర్,గుండె ఈశ్వర్, సూరారపు సైదులు,కొమ్ము వెంకన్న,కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్ల రాజేష్ లాకప్ డెత్ పై ప్రత్యేక చట్టం తేవాలి... ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న

Article Image

జాజిరెడ్డి గూడెం ;

ఈనెల 16న అర్వపల్లి మండల కేంద్రంలో జరగబోయే కర్ల రాజేష్ సంతాప సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న పిలుపునిచ్చారు.మంగళవారం అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.2025 నవంబర్ 16 న కోదాడలో లాకప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.ఇందుకోసం ఈనెల 16 న సాయంత్రం 5 గంటలకు జరగబోయే రాజేష్ సంతాప సభకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు చెప్పారు.రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అంతేగాక ఈ ఘటనలో సంబంధం ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పూలే, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఈదురు వీరపాపయ్య,విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు గడ్డం ఖాసీం,జిల్లా కార్యదర్శి పాల్వాయి పరశురామ్,కొండగడుపుల శ్రీను, మండల అధ్యక్షులు కుంకుడుపాల రవి,కార్యదర్శి మచ్చ నర్సయ్య, నాయకులు ఊటుకూరి రవీందర్,సంపతి విష్ణు,చెరుకు శైలేందర్,గుండె ఈశ్వర్, సూరారపు సైదులు,కొమ్ము వెంకన్న,కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News