PRINT TIME: May 26, 2026 04:38 PM
క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం
క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం
February 18, 2026 12:22 PM
32 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు: క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులపాటు పాటించే క్రీస్తు శ్రమల కాలం "ఉపవాస దినాలు" బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని తిరువూరు సహాయమాత దేవాలయం (ఆర్ సీ ఎం చర్చి) విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ జంగం తెలిపారు. ఏసు ప్రభువు ఉపవాసం ఉన్న 40 రోజులను స్మరిస్తూ పశ్చాతాపం, ఉపవాస ప్రార్ధన, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతనతో పవిత్రమైన సమయంగా ఆచరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే తో శ్రమల దినాలు పూర్తవుతాయని ఫాదర్ పేర్కొన్నారు. ఈ 40 దినాలు క్రీస్తు మాల ధరించిన దీక్షాపరులు ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ధ్యానిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఆరాధించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి