క్రిస్మస్ వేడుకలకు అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కు ధన్యవాదములు
క్రిస్మస్ వేడుకలకు అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కు ధన్యవాదములు
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే "క్రిస్మస్ పండుగకు" అధిక నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా అధ్యక్షులు పాస్టర్ జాన్ జహంగీర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 7 వేల చర్చిలకు, 21 కోట్ల రూపాయల నిధులు కేటాయించి, క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకొనే విధంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మరియు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ దీపక్ జాన్ లకు యాదాద్రి భువనగిరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సౌదర, సోదరీమణులు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని జహంగీర్ తెలిపారు. తెలంగాణ లోని ఒక్కోక్క చర్చికి రంగులు వేయుటకు మరియు విద్యుత్ దీపాలంకరణకు 30వేల రూపాయల చొప్పున కేటాయించి, క్రిస్మస్ విందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల కోట్ల నిధులు మంజూరు చేసి, క్రిస్మస్ 2025 వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారని ఆయన అన్నారు . ఈ అవకాశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చి లో బాధ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చర్చి కమిటీ లెటర్ ప్యాడ్ మీద, బ్యాంకు అకౌంట్ ను జతపరచి
ఈనెల 12 లోగా జిల్లా కలెక్టర్ కు లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు (1) *040*- *29801130*, *(2) 040*- *23391067* పోన్ నెంబర్లను
సంప్రదించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి