Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:29 PM

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య
January 04, 2026 04:34 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డు అంబేద్కర్ నగర్ గ్రౌండ్‌లో థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువకులతో కలిసి పట్టణ సీఐ వెంకటయ్య క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రెండు నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. క్రీడలతో పాటు క్రమశిక్షణతో సాధన చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం సాధ్యమని అన్నారు.

క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ టోర్నమెంట్‌కు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిగాల ఉపేందర్ గౌడ్ ఆర్థిక సహకారంతో

మొదటి బహుమతి – ₹20,000, రెండవ బహుమతి – ₹15,000, మూడవ బహుమతి – ₹10,00 నగదు బహుమతులను ప్రకటించారు.

ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనుండగా, చివరి రోజున బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాడుగుల నవీన్, అంగిడి ఉపేందర్, ఎర్ర మాధవరెడ్డి, పుల్లయ్య, థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ, నవీన్, శాంతి వర్ధన్, ఖదీర్, భార్గవ్, మనీ, రాహుల్, రాజు, రాజేష్, దీక్షిత్, భారత్, నితిన్, అరుణ్, శరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News