క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య
క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య
Biksham
సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం
క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డు అంబేద్కర్ నగర్ గ్రౌండ్లో థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువకులతో కలిసి పట్టణ సీఐ వెంకటయ్య క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రెండు నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. క్రీడలతో పాటు క్రమశిక్షణతో సాధన చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం సాధ్యమని అన్నారు.
క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ టోర్నమెంట్కు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిగాల ఉపేందర్ గౌడ్ ఆర్థిక సహకారంతో
మొదటి బహుమతి – ₹20,000, రెండవ బహుమతి – ₹15,000, మూడవ బహుమతి – ₹10,00 నగదు బహుమతులను ప్రకటించారు.
ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనుండగా, చివరి రోజున బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాడుగుల నవీన్, అంగిడి ఉపేందర్, ఎర్ర మాధవరెడ్డి, పుల్లయ్య, థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ, నవీన్, శాంతి వర్ధన్, ఖదీర్, భార్గవ్, మనీ, రాహుల్, రాజు, రాజేష్, దీక్షిత్, భారత్, నితిన్, అరుణ్, శరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి