Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:33 AM

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
February 25, 2026 09:27 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

అధ్యక్ష కార్యదర్శులుగా మెరుగు చంద్రమోహన్, ముత్యం ముఖేష్ గౌడ్

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బుధవారం టిఎస్ఐఐసీ కాలనీలోని ప్రెస్ క్లబ్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సలహాదారులు ఏంపల్లి పద్మారెడ్డి, బెలిదే అశోక్, అధ్యక్షులుగా మెరుగు చంద్రమోహన్, ఉపాధ్యక్షులుగా దిలీప్ కుమార్, యావాపురం రవి, దొమ్మాటి కిరణ్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి. శ్రీనివాస్, కె. వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఓ. నరసింహ, కీర్తి శ్రీనివాస్, కోశాధికారిగా రామచంద్రమూర్తి, కార్యవర్గ సభ్యులుగా గంగి కృష్ణ, గోవిందు కుంట్ల ఆంజనేయులు, బుడంపల్లి నిరంత్ గౌడ్, తొడుపునూరు బాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్, ముత్యం ముఖేష్ గౌడ్, కోశాధికారి రామచంద్రమూర్తి మాట్లాడుతూ కాప్రా ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమను కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నూతన సభ్యులకు సభ్యత్వాలను అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అభినందనల వెల్లువ

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు. అధ్యక్షులుగా మెరుగు చంద్రమోహన్,

ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్, కోశాధికారిగా రామచంద్ర మూర్తిలతో పాటు కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, పజ్జూరి పావనిరెడ్డి, కొత్త రామారావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, కొత్త అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు, బిజెపి చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్, సీనియర్ నాయకులు కనుకుల రజినీకాంత్ రెడ్డి, బిఆర్ఎస్ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి, నాయకులు, వంజరి ప్రవీణ్ కరిపే, ఎస్ఎ. రహీమ్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. శివానంద్ తదితరులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News