Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 03:02 PM

కనుల పండగ" శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం"

కనుల పండగ" శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం"

కనుల పండగ" శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం"
April 03, 2026 12:10 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ గుట్ట మీద అవతరించిన శ్రీశ్రీ జువ్వి నరసింహ స్వామి రాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద పండితులు, పురోహితులు మధ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ గుడిలో నరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవారీ నీ ముందుగా అలంకరించుకొని డప్పు చప్పులతో, డీజే పాటలతో గ్రామం నుండి భారీ ఊరేగింపుగా గ్రామ గుట్టమీద వెలసిన శ్రీశ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్ల ను తీసుకువెళ్లారు. ఈ కల్యాణ మహోత్సవానికి గ్రామం నుండి గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. గ్రామస్తులు స్వామివారిని పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు పొంది, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గ్రామాల్లోని వాహనాలు ముందుగా అలంకరించుకొని గుట్ట మీదికి తీసుకువెళ్లి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత సంప్రదాయంగా గుడి చుట్టూ తమ వాహనాలను తిప్పుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామి కళ్యాణ మహోత్సవంఅనంతరం గుట్టమీద నుండి వాహన మీద శ్రీశ్రీ జువ్విలక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను డప్పు చప్పులతో, డీజే పాటలతో, భారీగా ఊరేగింపుగా తీసుక వస్తుండగా గ్రామంలోని ప్రజలందరూ శ్రీశ్రీ జువ్వి నరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్లకు గ్రామంలోని మహిళలుమంగళ హారతులతు పట్టి స్వామివారిని ఆశీస్సులు పొందారు.






ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పలువురు మాట్లాడుతూ... గత శతాబ్దంలో గ్రామంలో వెలసిన శ్రీశ్రీ జువ్వి నరసింహ స్వామి సందర్భంగా అప్పట్లో మూడు రోజులుగా గుట్టమీద నరసింహస్వామి పండుగ నిర్వహించారని అన్నారు. కొన్ని కారణాలవల్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగలేదు, ఆ గుట్టమీద ఆలయం శీతల వ్యవస్థలో ఉంది. నరసింహ స్వామి ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో గ్రామ గుడి ఆవరణంలో శ్రీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. గత 22 సంవత్సరాల గుట్టమీద కళ్యాణ మహోత్సవం జరగలేదని అన్నారు. నరసింహ స్వామి భక్తులు, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సలహాసూచనలు మేరకు గ్రామ గుట్టమీద శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరిగిందని,ఈ పూర్వ వైభవం తీసుకువచ్చిన వారిని గ్రామo లోని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు, నరసింహస్వామి భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News