Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 10:27 PM

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు.. ప్రత్యేక పూజల్లో చిరుమర్తి

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు.. ప్రత్యేక పూజల్లో చిరుమర్తి

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు.. ప్రత్యేక పూజల్లో చిరుమర్తి
March 27, 2026 08:33 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు

శ్రీరామనవమి సందేశం ధర్మం–న్యాయం–ప్రజాహితం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్: శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లోని పలు రామాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకలు కన్నుల పండుగలా జరిగాయని, భక్తి వాతావరణంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీ రామనవమి పర్వదినం ధర్మం, న్యాయం, ప్రజాహితం వంటి విలువలను గుర్తుచేసే పవిత్రమైన రోజని తెలిపారు.

శ్రీ రాముడు తన పాలనలో ప్రజల సంక్షేమం, సమానత్వం, న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి రామరాజ్యాన్ని స్థాపించారని ఆయన చెప్పారు. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలన కొనసాగిందన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలిచాయని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు.

శ్రీ రాముడి పాలనలో ఉన్న నీతి, న్యాయం, పారదర్శకత, ప్రజల పట్ల నిబద్ధత వంటి విలువలు తెలంగాణ అభివృద్ధిలో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ శ్రీరాముడి ఆశీస్సులతో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News