PRINT TIME: February 24, 2026 03:07 AM
కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి
కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి
December 24, 2025 12:01 PM
388 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
బత్తుల ఉపేంద్ర భౌతిక కాయానికి నివాళులు
మారగోని మల్లయ్య, శంకరయ్య కుటుంబాలకు పరామర్శ
స్థానికం వార్తలు - రామన్నపేట:
కష్టకాలంలో కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు.
గ్రామానికి చెందిన బత్తుల ఉపేంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఉపేంద్ర భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మారగోని మల్లయ్య మరియు శంకరయ్య గార్ల నివాసాలకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి