కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే వేముల వీరేశం.
కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే వేముల వీరేశం.
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు విజయం సాధింపజేయాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఓటర్లను అభ్యర్థించారు. బుధవారం ఆయన మండలంలోని సిరిపురం, ఇంద్రపాలనగరం, బోగారం, నిర్నేముల, దుబ్బాక, వెల్లంకి గ్రామాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
సిరిపురంలో సిరిగిరెడ్డి అరుంధతి నర్సిరెడ్డి, ఇంద్రపాలనగరంలో పూస బాల నరసింహ, బోగారంలో గంపల రామచంద్రారెడ్డి, నిర్నేములలో కందిమల్ల గోపాల్ రెడ్డి, దుబ్బాకలో గట్టు యాదయ్య, వెల్లంకిలో గంజి భార్గవి భాస్కర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వారితో పాటు పోటీ చేస్తున్న కాంగ్రెస్ వార్డు సభ్యులు, అలాగే పార్టీకి మద్దతు తెలిపిన ఇతర పార్టీల అభ్యర్థులందరికీ ఓటర్లు తమ ఆశీర్వాదం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులే సరైన ఎంపిక అని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గంగుల వెంకట రాజారెడ్డి, గుత్తా నరసింహారెడ్డి, పున్న జగన్మోహన్, సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, పూస బాలకిషన్, గోగు సత్తయ్య,కడారి ఐలయ్య, గోగు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి