Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:51 AM

కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే వేముల వీరేశం.

కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే వేముల వీరేశం.

కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే వేముల వీరేశం.
December 11, 2025 11:53 AM 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు విజయం సాధింపజేయాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఓటర్లను అభ్యర్థించారు. బుధవారం ఆయన మండలంలోని సిరిపురం, ఇంద్రపాలనగరం, బోగారం, నిర్నేముల, దుబ్బాక, వెల్లంకి గ్రామాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

సిరిపురంలో సిరిగిరెడ్డి అరుంధతి నర్సిరెడ్డి, ఇంద్రపాలనగరంలో పూస బాల నరసింహ, బోగారంలో గంపల రామచంద్రారెడ్డి, నిర్నేములలో కందిమల్ల గోపాల్ రెడ్డి, దుబ్బాకలో గట్టు యాదయ్య, వెల్లంకిలో గంజి భార్గవి భాస్కర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



వారితో పాటు పోటీ చేస్తున్న కాంగ్రెస్ వార్డు సభ్యులు, అలాగే పార్టీకి మద్దతు తెలిపిన ఇతర పార్టీల అభ్యర్థులందరికీ ఓటర్లు తమ ఆశీర్వాదం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులే సరైన ఎంపిక అని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గంగుల వెంకట రాజారెడ్డి, గుత్తా నరసింహారెడ్డి, పున్న జగన్మోహన్, సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, పూస బాలకిషన్, గోగు సత్తయ్య,కడారి ఐలయ్య, గోగు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News