కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ
కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ
Biksham
చిలుపగుంట్లలో ఘనంగా నివాళులు
నూతనకల్లు: మండలంలోని చిలుపగుంట్ల గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ గజ్జల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో పలువురు నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ, జాన్ రెడ్డి పార్టీ కోసం చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు.
మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం మాట్లాడుతూ, జాన్ రెడ్డి నిరాడంబర జీవితం, ప్రజల పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అంజి పెళ్లి నరసమ్మతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి