Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:03 AM

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం
05-05-2026 750 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాలుజారి బావిలో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధి బోర్గి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సావిత్రిబాయి (30), ఆమె కుమార్తె నిఖిత (12), మరో బాలిక నందిని (13) బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లగా నిఖిత, నందిని ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి బావిలోకి దిగగా ఆమె కూడా ప్రమాదానికి గురై ముగ్గురూ మృతి చెందారు. మృతులు జీవనోపాధి కోసం చాలాకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తూ ఉండగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతులలో నందిని, నిఖితలు మొగడం పల్లి సిర్గాపూర్ హాస్టల్‌లో 6వ తరగతి చదువుతున్నట్లు వారి తండ్రి జాదవ్ పర్సురామ్ తెలిపారు. సమాచారం అందుకున్న కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బోర్గి గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం

Article Image

కాలుజారి బావిలో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధి బోర్గి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సావిత్రిబాయి (30), ఆమె కుమార్తె నిఖిత (12), మరో బాలిక నందిని (13) బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లగా నిఖిత, నందిని ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి బావిలోకి దిగగా ఆమె కూడా ప్రమాదానికి గురై ముగ్గురూ మృతి చెందారు. మృతులు జీవనోపాధి కోసం చాలాకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తూ ఉండగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతులలో నందిని, నిఖితలు మొగడం పల్లి సిర్గాపూర్ హాస్టల్‌లో 6వ తరగతి చదువుతున్నట్లు వారి తండ్రి జాదవ్ పర్సురామ్ తెలిపారు. సమాచారం అందుకున్న కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బోర్గి గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News