కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం
Krishna
కాలుజారి బావిలో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధి బోర్గి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సావిత్రిబాయి (30), ఆమె కుమార్తె నిఖిత (12), మరో బాలిక నందిని (13) బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లగా నిఖిత, నందిని ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి బావిలోకి దిగగా ఆమె కూడా ప్రమాదానికి గురై ముగ్గురూ మృతి చెందారు. మృతులు జీవనోపాధి కోసం చాలాకాలంగా హైదరాబాద్లో నివసిస్తూ ఉండగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతులలో నందిని, నిఖితలు మొగడం పల్లి సిర్గాపూర్ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నట్లు వారి తండ్రి జాదవ్ పర్సురామ్ తెలిపారు. సమాచారం అందుకున్న కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బోర్గి గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి