కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Biksham
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని కిరాణం మర్చెంట్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన మొత్తం మూడువందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం కింద రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు, షాదీ ముబారక్ పథకం కింద యాభై రెండు లక్షల ఆరు వేల ముప్పై రెండు రూపాయలు మొత్తం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
పేద మరియు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఈ పథకాలు మహిళలకు గౌరవం, భరోసా కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేన రెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి