Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:28 AM

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న
24-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాల్వల పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగుతుర్తి నియోజకవర్గాలకు నీటిసరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రూ.30 కోట్ల ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో తుంగుతుర్తి, భువనగిరి ప్రాంతాల్లో కొంతమేరకు నీటిని అందించగలిగారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయోజనం అందాలంటే కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కాల్వపై ఒక చిన్న బ్యారేజీ నిర్మించాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు మిగిలిన ప్యాకేజీకి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు.

Sthanikam

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న

Article Image

హైదరాబాద్,

బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాల్వల పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగుతుర్తి నియోజకవర్గాలకు నీటిసరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రూ.30 కోట్ల ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో తుంగుతుర్తి, భువనగిరి ప్రాంతాల్లో కొంతమేరకు నీటిని అందించగలిగారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయోజనం అందాలంటే కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కాల్వపై ఒక చిన్న బ్యారేజీ నిర్మించాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు మిగిలిన ప్యాకేజీకి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News