కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న
కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న
Editor Desk
హైదరాబాద్,
బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించిన కాల్వల పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగుతుర్తి నియోజకవర్గాలకు నీటిసరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రూ.30 కోట్ల ఆర్ఆర్ ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో తుంగుతుర్తి, భువనగిరి ప్రాంతాల్లో కొంతమేరకు నీటిని అందించగలిగారని పేర్కొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయోజనం అందాలంటే కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కాల్వపై ఒక చిన్న బ్యారేజీ నిర్మించాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు మిగిలిన ప్యాకేజీకి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి