Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:16 PM

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
26-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని విత్తనాలు, ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సన్న రకాల వరి విత్తనాలను ప్రోత్సహించాలని డీలర్లకు సూచించారు. కల్తీ విత్తనాల విక్రయాలు నిర్వహించినా, వాటిని ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిలో హెచ్‌డీ కాటన్‌ను ప్రభుత్వం నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా విక్రయాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, యాప్ ద్వారా యూరియా బుకింగ్ జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియాను ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించి సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

Sthanikam

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి,

జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని విత్తనాలు, ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సన్న రకాల వరి విత్తనాలను ప్రోత్సహించాలని డీలర్లకు సూచించారు. కల్తీ విత్తనాల విక్రయాలు నిర్వహించినా, వాటిని ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిలో హెచ్‌డీ కాటన్‌ను ప్రభుత్వం నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా విక్రయాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, యాప్ ద్వారా యూరియా బుకింగ్ జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియాను ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించి సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News