కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
Editor Desk
యాదాద్రి భువనగిరి,
జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని విత్తనాలు, ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సన్న రకాల వరి విత్తనాలను ప్రోత్సహించాలని డీలర్లకు సూచించారు. కల్తీ విత్తనాల విక్రయాలు నిర్వహించినా, వాటిని ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిలో హెచ్డీ కాటన్ను ప్రభుత్వం నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా విక్రయాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, యాప్ ద్వారా యూరియా బుకింగ్ జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియాను ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించి సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి