కల్కి భగవాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కల్కి భగవాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Krishna
సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో కల్కి భగవాన్ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కల్కి భగవాన్ కల్యాణ మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని కల్కి భగవాన్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్కి భగవాన్ భక్త బృందాన్ని అభినందించారు. ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేయగా, ఆలయ నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కల్కి భక్త బృంద సభ్యులు సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి