Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 08:24 PM

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం
February 27, 2026 06:59 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట: మండలంలోని కక్కిరేణి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామన్నపేట లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్సౌ జన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 180 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు లయిన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్స్ గాలయ్య బోయ, కార్యదర్శి డాక్టర్ వనకంటి భాస్కర్ రావు తెలిపారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ఈ సందర్భంగా 15 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నూల సిద్ధప్ప, సంజీవరెడ్డి, యాపాల కృష్ణారెడ్డి, అనువర్ణా దేవి, గుత్త నరసింహారెడ్డి, బొడ్డు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News