Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:57 AM

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం
March 25, 2026 05:39 PM 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలోమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, దాతలు, తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

ముఖ్య అతిథి ఎంఈఓ దొడ్డి స్వామి మాట్లాడుతూ ఒకే పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రులు, దాతల భాగస్వామ్యం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. లిఖిత, జస్విక, అక్షతల ప్రదర్శనలు విశేషంగా మెప్పించాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా మధురవేణి సురేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు ఉప సర్పంచ్ నడిగోటి పాండు ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్టా రాంరెడ్డి కృష్ణారెడ్డి కృష్ణమాచార్యులు , సామజిక కార్యకర్త వేముల సైదులు ప్రధానోపాధ్యాయులు గణేషు కృష్ణ స్వర్ణలత గోపాల్ రెడ్డి ప్రశాంతి పాఠశాల తల్లిదండ్రులు గుండు సంధ్య ,సైదులు , అంకిరెడ్డి కావ్య వెంకట్ , చిల్ల భవాని మధు నడిగోటి సంతోష కమలాకర్ , గుండె పూరి మాధవి రాజు , తెడ్ల రాజు చిల్ల వినయ్ పాపని జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News