Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:32 PM

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి
April 28, 2026 07:47 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ పార్టీకి వెన్నెముకలాంటిదని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సమర్థ శిక్షణ శిబిరం”లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణ, సేవా దృక్పథంపై ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్థాగత బలోపేతం సాధ్యమవుతుందని అన్నారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ ఎల్లప్పుడూ ముందుండాలని కోరారు. ఈ శిబిరంలో క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాల పెంపు, ప్రజలతో మమేకం కావడం, పార్టీ నిర్మాణ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, పలువురు సీనియర్ నాయకులు మరియు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News