PRINT TIME: May 26, 2026 07:47 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
February 01, 2026 12:00 PM
182 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ బలోపేతం
సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎనిమిదో వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు పోలేబోయిన సైదులు, పంపటి ఆనంద్, ధారవత్ రాము చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నెల్లుట్ల లింగాస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు, జూలకంటి నాగేందర్ రెడ్డి, గంగలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి