కాంగ్రెస్ నాయకులారా , మల్లయ్య యాదవ్ పై అబద్ధాలు ప్రచారం చేస్తే నాలుకలు చీరేస్తాం
కాంగ్రెస్ నాయకులారా , మల్లయ్య యాదవ్ పై అబద్ధాలు ప్రచారం చేస్తే నాలుకలు చీరేస్తాం
Editor Desk
బి ఆర్ ఎస్ పార్టీ మునగాల మండలం అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య.
కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై జనవరి 24న చలో కోదాడ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ భారీ బహిరంగ సభ నిర్వహించి కర్ల రాజేష్ మృతి పై వాస్తవాలను బయటపెట్టి బహిరంగంగా విసిరిన సవాలుకు మునగాల మండల కేంద్రంలో జనవరి 28న బుధవారం నిర్వహించిన సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉత్తమ్ దంపతులు తమ పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన దళిత కార్యకర్తలని అడ్డంపెట్టుకొని కర్ల రాజేష్ మృతికి కోదాడ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ కారణమని దుష్ప్రచారానికి దిగుతూ. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఎల్పీ రామయ్య అన్నారు,శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కోదాడ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో లబ్ధిపొందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు,నాటి కోదాడ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందించామన్నారు, కోదాడకు చెందిన మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు వరప్రసాద్ రెడ్డి గుండె ఆపరేషన్ కాగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందించామని,ముస్కు శ్రీనివాసరెడ్డికి కుటుంబానికికళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయల చెక్కు అందించామని, కోదాడ మండల బలహీన వర్గాలకు చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అర్జున్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించి ఆదుకున్నది కూడా మల్లన్న అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలు,జెండాలు అనే తారతమ్యం లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో మల్లన్న నియోజకవర్గం లో ప్రతి కుటుంబానికి రైతుబంధు, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఇలా కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా లబ్ధి జరిగేలాగా విశేషంగా కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ నేడు ఉత్తమ్ దంపతులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి బలహీన వర్గాల నాయకుల్ని కార్యకర్తలను ఉసిగొలిపి అర్థంపర్థం లేని నిందారోపణలు చేపిస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆదేశాలతోనే చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి మరి కొంతమంది పోలీసులు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పేరు చెప్పాలని చిత్రహింసలు పెట్టి రాజేష్ మరణానికి కారకులు అయ్యారని మీడియా సాక్షిగా బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ విమర్శించారని, ఆయన చేసిన విమర్శలను సమాధానం చెప్పుకోలేని ఉత్తమ్ దంపతులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు పెట్టి దుష్ప్రచారానికి తెరలేపారు అన్నారు,సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తొగరు రమేష్, మండల ఉపాధ్యక్షులు గోపిరెడ్డి నాగిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్, మునగాల పట్టణ అధ్యక్షులు ఉడుం కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్ నాగబాబు గడ్డం లింగయ్య , కాపర్తి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి