కాంగ్రెస్ జిల్లా నాయకులకు ఘన స్వాగతం
కాంగ్రెస్ జిల్లా నాయకులకు ఘన స్వాగతం
Editor Desk
రామన్నపేట: యాదాద్రి–భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిమ్మాపురం మహేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గుండాల నరసింహలను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరిలోని వివేర హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూస బాలకిషన్, జినుకల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, శంబాల వెంకన్న, కే. భాస్కర్ రెడ్డి, తాళ్లపల్లి సత్తిరెడ్డి, పోలు వెంకట్ రెడ్డి, ఎడ్ల సురేందర్ రెడ్డి, కర్రె రమేష్, పి. నరసింహ, బి. నరసింహ, గట్టు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి