Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:45 AM

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
February 09, 2026 07:52 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News