కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Komidala Mahender reddy
గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి