Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:48 AM

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
09-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News