Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
February 09, 2026 07:52 AM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News