Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:05 AM

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే విస్తృత ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే విస్తృత ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే విస్తృత ఎన్నికల ప్రచారం
February 07, 2026 09:35 AM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 10వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి గడపను తట్టుతూ ప్రజలతో నేరుగా మమేకమై ప్రచారం కొనసాగించారు. బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారాలపై భరోసా ఇచ్చారు.గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జుక్కల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇప్పటికే పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించారు.అధికార పార్టీలోని అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అందుకే బిచ్కుంద మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News