PRINT TIME: June 10, 2026 02:11 PM
జూకల్ భక్తుల శ్రీశైలంకు పాదయాత్ర – ఉమామహేశ్వరానికి చేరుకున్న యాత్రికులు
జూకల్ భక్తుల శ్రీశైలంకు పాదయాత్ర – ఉమామహేశ్వరానికి చేరుకున్న యాత్రికులు
February 26, 2026 08:07 PM
41 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
నారాయణఖేడ్: మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన భక్తులు సంఘయ్య సామి ఆధ్వర్యంలో శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకొని ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ నెల 27న శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. సుమారు 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్గమధ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణతో ముందుకు సాగుతున్నారు. జంగం సంగయ్య స్వామి, పోగుల గాల్ రెడ్డి, మడపతి బసవయ్య స్వామి, మడ్డం గురయ్య స్వామి, సిద్ధారెడ్డి, వండరెడ్డి, విట్టల్ రెడ్డి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి