Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే
29-05-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తూకం విధానం, ధాన్యం నాణ్యత పరీక్షలను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తూకంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రెడ్డి, శ్రీకాంత్ పీఏసీఎస్ చైర్మన్, మాణిక్ రావు పాటిల్, సచిన్ పాటిల్, నగల్ గిద్దా మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తూకం విధానం, ధాన్యం నాణ్యత పరీక్షలను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తూకంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రెడ్డి, శ్రీకాంత్ పీఏసీఎస్ చైర్మన్, మాణిక్ రావు పాటిల్, సచిన్ పాటిల్, నగల్ గిద్దా మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News