జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తూకం విధానం, ధాన్యం నాణ్యత పరీక్షలను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తూకంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రెడ్డి, శ్రీకాంత్ పీఏసీఎస్ చైర్మన్, మాణిక్ రావు పాటిల్, సచిన్ పాటిల్, నగల్ గిద్దా మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి