జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు
జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు
Krishna
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 90 వేల ఎకరాలకు పైగా జొన్న పంట సాగు జరిగిందని, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ రైతులు తమ పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పంట కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రమకు తగిన ధర దక్కేలా ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, రైతు నాయకులు విఠల్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి