Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:53 PM

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు
April 28, 2026 07:39 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 90 వేల ఎకరాలకు పైగా జొన్న పంట సాగు జరిగిందని, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ రైతులు తమ పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పంట కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రమకు తగిన ధర దక్కేలా ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, రైతు నాయకులు విఠల్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News