Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:33 PM

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు
April 28, 2026 07:39 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 90 వేల ఎకరాలకు పైగా జొన్న పంట సాగు జరిగిందని, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ రైతులు తమ పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పంట కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రమకు తగిన ధర దక్కేలా ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, రైతు నాయకులు విఠల్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News