Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:01 PM

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…
12-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్ నగర పాలనలో కొత్త మార్పులు

హైదరాబాద్ నగర పాలనలో పెద్ద మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనతో పాటు కొత్త పట్టణ పాలన చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే నగర పాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణాల అనుమతులు, రహదారుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి ప్రధాన వ్యవహారాలు కేంద్రీకృత విధానంలో నిర్వహించబడతాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ల అధికారాలను కొంత మేరకు పరిమితం చేసి, పాలనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.హైదరాబాద్ నగరం విస్తరణ దృష్ట్యా పరిపాలనను సులభతరం చేయడం, సేవలను వేగవంతంగా అందించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త చట్టం రూపకల్పనపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Sthanikam

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

Article Image

హైదరాబాద్ నగర పాలనలో కొత్త మార్పులు

హైదరాబాద్ నగర పాలనలో పెద్ద మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనతో పాటు కొత్త పట్టణ పాలన చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే నగర పాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణాల అనుమతులు, రహదారుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి ప్రధాన వ్యవహారాలు కేంద్రీకృత విధానంలో నిర్వహించబడతాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ల అధికారాలను కొంత మేరకు పరిమితం చేసి, పాలనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.హైదరాబాద్ నగరం విస్తరణ దృష్ట్యా పరిపాలనను సులభతరం చేయడం, సేవలను వేగవంతంగా అందించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త చట్టం రూపకల్పనపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News