జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…
జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…
Biksham Goud
హైదరాబాద్ నగర పాలనలో కొత్త మార్పులు
హైదరాబాద్ నగర పాలనలో పెద్ద మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనతో పాటు కొత్త పట్టణ పాలన చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే నగర పాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణాల అనుమతులు, రహదారుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి ప్రధాన వ్యవహారాలు కేంద్రీకృత విధానంలో నిర్వహించబడతాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ల అధికారాలను కొంత మేరకు పరిమితం చేసి, పాలనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.హైదరాబాద్ నగరం విస్తరణ దృష్ట్యా పరిపాలనను సులభతరం చేయడం, సేవలను వేగవంతంగా అందించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త చట్టం రూపకల్పనపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి