Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు
January 11, 2026 06:51 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలో పరిధిలో బోరంచ గ్రామంలో అతి పూరితమైన ప్రసిద్ధిచెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మండలంలోని దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ పవిత్ర సందర్భంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్,కుటుంబ సభ్యులు మరియు జీఎంఆర్ టీం సభ్యులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా, బోరంచ గ్రామం మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యవంతమైన జీవితం పొందాలని, రైతులు పండుగల మాదిరి పంటలు పండాలని, యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశారు.మచ్చేందర్ భరోసా ఇచ్చి, నల్ల పోచమ్మ తల్లి ఆశీస్సులతో బోరంచ గ్రామం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టంగా తెలిపారు.ఈ పవిత్ర దర్శన కార్యక్రమంలో నూతన సర్పంచ్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.కార్యక్రమం ముగిసిన తర్వాత, మచ్చేందర్ గ్రామ ప్రజలతో సన్నిహితంగా కలసి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గ్రామ ప్రజలు ఈ సందర్భంలో మచ్చేందర్ సేవలను ప్రశంసిస్తూ,తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు అని గుర్తించి అభినందనలు తెలిపారు.జీఎంఆర్ ఫౌండేషన్ ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకొని, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News