Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:46 PM

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు
January 11, 2026 06:51 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలో పరిధిలో బోరంచ గ్రామంలో అతి పూరితమైన ప్రసిద్ధిచెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మండలంలోని దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ పవిత్ర సందర్భంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్,కుటుంబ సభ్యులు మరియు జీఎంఆర్ టీం సభ్యులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా, బోరంచ గ్రామం మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యవంతమైన జీవితం పొందాలని, రైతులు పండుగల మాదిరి పంటలు పండాలని, యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశారు.మచ్చేందర్ భరోసా ఇచ్చి, నల్ల పోచమ్మ తల్లి ఆశీస్సులతో బోరంచ గ్రామం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టంగా తెలిపారు.ఈ పవిత్ర దర్శన కార్యక్రమంలో నూతన సర్పంచ్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.కార్యక్రమం ముగిసిన తర్వాత, మచ్చేందర్ గ్రామ ప్రజలతో సన్నిహితంగా కలసి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గ్రామ ప్రజలు ఈ సందర్భంలో మచ్చేందర్ సేవలను ప్రశంసిస్తూ,తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు అని గుర్తించి అభినందనలు తెలిపారు.జీఎంఆర్ ఫౌండేషన్ ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకొని, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News