ఇంద్రపాలనగరం,
టెన్త్ ఫలితాల్లో ఇంద్రపాలనగరం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శాతం వంద ఉత్తీర్ణత సాధించడం ఆనందదాయకమని గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని, ప్రభుత్వ పాఠశాలను విశ్వసించి పిల్లలను చదివించిన తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు సహకరించిన గ్రామ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధించగలవని ఈ విజయంతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి