Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 01:23 PM

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు
March 22, 2026 10:44 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

మేడ్చల్: జవహర్‌నగర్ జీహెచ్ఎంసి పరిధిలోని పలు ఈద్ఘాల్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. కాప్రా మండలం జవహర్‌నగర్, వికలాంగుల కాలనీ నయా ఈద్ఘా, వెంకటేశ్వర కాలనీ పాత ఈద్ఘా, అంబేద్కర్ నగర్, మల్కారం, ఫరానగర్, అరుంధతీ నగర్, వైఎస్ఆర్ డంపింగ్ యార్డ్ ఈద్ఘాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖురాన్ బోధనలను అనుసరించే వారు శాంతియుత జీవితం గడుపుతారని, ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగి శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు.

జవహర్‌నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా, కార్యదర్శి టి. కాలేషా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మల్లెపూల శ్రీకాంత్, కారింగుల జ్యోతి శంకర్ గౌడ్, యువజన నాయకులు వినయ్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రార్థనలు సజావుగా జరిగేలా సీఐ సైదులు, ఎస్సై రామ్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత కల్పించారు.







మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News