Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు
March 22, 2026 10:44 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మేడ్చల్: జవహర్‌నగర్ జీహెచ్ఎంసి పరిధిలోని పలు ఈద్ఘాల్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. కాప్రా మండలం జవహర్‌నగర్, వికలాంగుల కాలనీ నయా ఈద్ఘా, వెంకటేశ్వర కాలనీ పాత ఈద్ఘా, అంబేద్కర్ నగర్, మల్కారం, ఫరానగర్, అరుంధతీ నగర్, వైఎస్ఆర్ డంపింగ్ యార్డ్ ఈద్ఘాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖురాన్ బోధనలను అనుసరించే వారు శాంతియుత జీవితం గడుపుతారని, ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగి శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు.

జవహర్‌నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా, కార్యదర్శి టి. కాలేషా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మల్లెపూల శ్రీకాంత్, కారింగుల జ్యోతి శంకర్ గౌడ్, యువజన నాయకులు వినయ్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రార్థనలు సజావుగా జరిగేలా సీఐ సైదులు, ఎస్సై రామ్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత కల్పించారు.







మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News